Monday, May 11, 2015

sundaramo sumadhuramo

మిత్రులకి వందనం

రాజా పార్వై అని కమల్ హాసన్ గారి తమిళ చిత్రం అందులో పాటలు కొన్ని వందల సార్లు విన్నా, ముఖ్యంగా Andhi mazhai  pozhigirathu  పాట, రాజా గారు  అద్భుతంగా చేసారు, బాలు జానకి చాలా అంటే చాలా బాగా పాడారు, తెలుగులో అమావాస్య చంద్రుడుగా చేసారు, తెలుగులో ని గొప్ప దర్శకులలో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు గారు చేసారు రెండు భాషలలోను

వేటూరి కలం పలు విన్యాసాలు చేసింది, మొదటి చరణంలో హంసా నంది రాగాలైతే అని రాసారు కాబట్టి ఆ రాగం అనుకుంటా, తప్పు అయితే పెద్దలు సరిచెయ్యగలరు, చిత్రంలో "నాయకుడు" అంధుడు అందకే అనుకుంటా వేటూరిగారు కన్నుల్లో  గంగా యమునా పొంగేనులే అన్నారు, చరణాలలో ఒక హిందుస్తానీ ఆలాప్ ఉంటుంది ఎంత బాగుంటుందో

సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమొ
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమొ
మలయజ మారుత శీకరమొ  మనసిజ రాగావసీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమొ

ఆనందాలే భోగలైతే ......  హంసా నంది రాగాలైతే
నవ వసంత గానలేవో సాగేనులే  సుర వీణా  నాదలెన్నొ మొగేనులే 
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో  మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులోదిన  గీతికలో 
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమొ

అందాలన్నీ అందే వేళా.... బంధాలన్నీ పొందే వేళా
కన్నుల్లో  గంగా యమునా పొంగేనులే.... కౌగిట్లో  సంగమమేదొ సాగేనులే
కోరికలే శారికలై  ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమొ

https://www.youtube.com/watch?v=RX09OhbAGww


No comments:

Post a Comment