Saturday, July 25, 2015

vedam la ghoshinche godaavari

మిత్రులకి వందనం

నిన్ననే గోదావరి మహా పుష్కరాలు ముగిసాయి, రెండు తెలుగు రాష్ట్రల  ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

మన భారత దేశంలో 12 మహానదులు ఉన్నాయి వాటికి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటాం, ఆ 12 నదులు గంగ, నర్మదా, సరస్వతి, యమునా, గోదావరి, కృష్ణ, కావేరి, భీమ, తపతి, తుంగభద్ర, సిందు, ప్రాణహిత.

ఇందులో మన తెలుగు రాష్ట్రాలలో ప్రవహించేవి గోదావరి, కృష్ణ, ప్రాణహిత నదులు. తుంగభద్రా నది లోని ఒక పాయ మన రాష్ట్రంలోకి వచ్చినా అది సహజమైనది కాదు అందుకు!

వచ్చే సంవత్సరం మన కృష్ణా పుష్కరాలు జరుపుకుందాం, అప్పుడైనా తోపులాటా, తోక్కిసలాటా లేకుండా జరుపుకుందాం.

నదులు మన జీవనంలో ఎంతో ప్రాముఖ్యమ్. వాటి మనుగడ కాపాడడం మన చేతిలో ఉంది. 

టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రగా తెరకెక్కిన అంద్రకేసరి చిత్రంలోని ఈ గోదావరి పాట చూద్దాం, ఆరుద్ర గారి రచన చేసిన ఈ పాటని బాలుగారు పడితే సత్యం గారు సంగీతం సమకూర్చారు.

నిన్న గోదావరి ముగుంపు ఉత్సవాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది ఎంత develop అయ్యింది రాజమహేంద్రి అని. ఈ పాట లో చూడండి ఆ రోజులలో ఎలా ఉందొ నగరం. ఒకటి గమనించండి  మిత్రులు పాటలో ఎందరో ప్రజలు పుణ్యస్నానాలు చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా సబ్బులు, షంపూలు వాడుతున్నట్టు కనపడదు, ఆ రోజులలో అంతగా లేవు, ఈ రోజు ఉన్నాయి, కాని ఒక్కమనవి దయచేసి నదీ స్నానమప్పుడు ఇవేమీ వాడకండి, మన నదులను కాపాడుకుందాం, మన సంప్రదాయాలని పాటింద్దాం.

వేదంలా ఘోషించే గోదావరీ
ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు 

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివసము పెద్ద ముచ్చటా
కవిసార్వభౌమలకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము 

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు 

https://www.youtube.com/watch?v=TjAKRd7uNRs

No comments:

Post a Comment