Tuesday, July 7, 2015

గోదావరి పావనోదార వాక్పూరమఖిలభారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవుల గానము శ్రుతి కలయునాడు
పెన్నానది సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెలుగు వాసించునాడు
కృష్ణా తరంగ నిన్నిద్ర గానముతోడ శిల్పమ్ము తొలిపూజ చేయునాడు
అక్షర జ్ఞానమెరుగదొ ఆంద్ర జాతి విమలక్రిష్ణానది సైకతములయందు
కోకిలపు పాట పిచ్చుక గూళ్ళు గట్టి వేర్చుకున్నది  పూర్ణిమా నిశలయందు


పరమ పావనములు మహిమాన్వితములు అయిన గోదావరీ వాక్ తరంగాలు .... ఈ భారతము మాదీ అన్నదోకనాడు. కవులందరి కవితగానంతో ఉప్పొంగే తరంగ రావాలతో తుంగభద్రా నది తానూ కూడా కలసి గానం చేసింది ఒకనాడు. పెన్నా నది తీరాల్లో ఉత్పన్నలైన తెల్లతామరల వరుసలతో గూడి తెలుగు కవిత్వం వెలుగులు పొందింది ఒకనాడు. కృష్ణానదీ నిరంతర తరంగ గానము ఉలి శబ్దాలతో శిల్పకళకు తొలిపూజ చేసింది ఒకనాడు. అటువంటి రోజుల్లో ఆంధ్రజాతి కృష్ణాతీర ఇసుక తెన్నెలపై చక్కని పున్నమి రాత్రులందు కూడా పిచ్చుకగూళ్ళు కట్టుకుంటూ కొకిలపాటలను నేర్చుకుంది 

No comments:

Post a Comment