మిత్రులకి వందనం
రెహమాన్ పాటలు హిట్ కావడానికి కారణం తను వాడే రాగాలంటా, ఎవ్వరు వాడని రాగాలు మనకి వినిపిస్తారు అవి భలే ఉంటాయి, కండుకొండేన్ కండుకొండేన్ అనే తమిళ్ చిత్రం తెలుగులో ప్రియురాలు పిలిచింది అని డబ్బింగ్ చేసారు, అందులో దోబూచులాటేలరా అనే పాట నాట్టై కురింజి అనే రాగంలో చేసారు. అలాగే ఇద్దరు చిత్రం లో శశి వదనే పాట కూడా అదే రాగం లో చేసారు, చరణాలలో గంభీరానాటా, మాండు రాగం కూడా వినిపిస్తాయి. ఈ రాగంలో తెలుగులో వేరే ఏమైనా పాటలు ఉంటే పెద్దలు చెప్పగలరు.
చిత్రమ్మ పాడిన ఈ పాట నిర్మాత A M రత్నం, శివ గణేష్ కలిసి రాసారు,
దోబూచులాటేలరా.. గోపాల మనసంత నీవేనురా...
దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా
ఆ ఏటి గట్టునేనడిగా చిరు గాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదు
చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా
నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొదఆగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాల
నీ కౌగిలిలో కరిగించరా నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
నా యెదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా...
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు..
నయనాలు వర్షించ నన్నెట్లు బ్రోచేవు
పూవునకనే నీ మతమా నేనొక్క స్త్రీ నే కదా గోపాల
అది తిలకించ కనులే లేవా నీ కలలే నే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ కాపాడరా
https://www.youtube.com/watch?v=erlSe69Skus