Saturday, April 11, 2015

gharhsya dharmam

మిత్రులకు సుమనఃసుమంజలి

చాలారోజులైంది మిమ్ముములనందరిని కలిసి. ఈ వ్యాసం నీను రాసింది కాదు మా సోదరుడు రాసింది బాగుందని మీకోసం ఇక్కడ ప్రచురిస్తున్నా

గార్హస్థ్య ధర్మం గురించి ఈ రోజు తెలుసుకుందాం

గార్హస్థ్యధర్మ (గృహస్థధర్మము)పీఠానికి పాదాలు నాలుగు .. 

ఒకటి - గృహస్థు లేక యజమాని..,
రెండు - గృహిణి లేక ఇల్లాలు..,
మూడు - పుత్రుడు లేక సంతానం..,
నాల్గు - ధర్మం .., ఇదే సత్యమని,త్యాగమని, శాంతమని,ప్రేమ అని,అహింస అని అనేక పేర్లతో పిలవబడుతోంది..!

యజమాని, ఇల్లాలు, సంతానము కూడా వారి వారి విధులను ధర్మబద్ధంగా నిర్వహించాలి..

దీనికి ఉదాహరణ .. మహాభారతంలోని  ...,యయాతి-దేవయాని-శర్మిష్ఠ-పూరుని  కథలే..

"త్యాగేనైకేన అమృతత్వమానశుః" - అనేది ఉపనిషత్సూక్తి. 


అన్నదమ్ములందరూ కాదన్నా ..., "తనువిచ్చిన తండ్రికి-తనువిచ్చుకోడం తన సుకృతమనుకున్నాడు.., తండ్రి ముసలితనాన్ని తానుస్వీకరించి తండ్రికి యౌవనాన్నితిరిగి తీసుకవచ్చేడు..పూరుడు. ఆతని త్యాగమే... తండ్రి గార్హస్థ్యధర్మానికీ .., తద్వారా గార్హస్త్యంలో ముఖ్యమైన తన పుత్ర ధర్మానికీ.., త్యాగగుణం వలన కలిగే అమృతత్వసిద్ధికి కారణమైంది ..

మనం కూడా ఆ అమృతత్వ సిద్ధికి ప్రయత్నం చేసేందుకు యయాతి కథ ద్వారా మనకందించింది మహాభారతం..

దానవులకు శరీరం ముఖ్యం ..చనిపోయినా మళ్ళా బ్రతకాలి.. బ్రతకడం మీద ఉన్న యిచ్ఛ ఎల్లా బ్రతకాలి అనేదానిమీద అస్సలు ఉండదు వాళ్ళకి ..

మానవులకి ముఖ్యం - ఎల్లా మరణించామన్నది కాదు, ఎల్లా జీవితాన్ని సాగించామన్నది ముఖ్యం. మనిషి చనిపోయినా ఆతణ్ణి బ్రతికించేది ధర్మం..అందునా శ్రేష్ఠమయిన ధర్మం త్యాగం. అందుచేతనే .. మానవజీవితంలో మరణాన్ని,  భౌతికంగా జయించే పద్ధతికంటే ..., ధార్మికంగా జయించే పద్ధతికి ప్రాముఖ్యతేర్పడింది.

గార్హస్థ్య ధర్మం నాలుగు పాదాలతో నడవాలంటే.., ఆ ధర్మాన్ని నిర్వహించే వారికి అంతఃకరణ శుద్ధి ఉండాలి.  చిత్తశుద్ధి లేకపోతే సత్యం ప్రకటితం కాదుకదా! సత్యం నిలవకపోతే సంసార వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఇల్లాలికి అన్యాయం జరుగుతుంది ... పుత్రుడికి అస్తిత్వం లేకుండా పోతుంది.. గృహస్థు అసత్యదోషంతో అంతరించిపోతాడు.  కనుక గార్హస్థ్య ధర్మానికి అమృతత్వమ్ కలిగించేది -  సత్యధర్మనిరతి అనేది సత్యం.

మానవ జీవితంలో మృత్యువొక అనివార్యo..  కానీ, మరిణించే దేహం నిర్వహించే ధర్మం అజరామరo! 
దానిని సాధించడమే మానవజీవన పరమార్ధం....గమ్యం.(మహాభారతం)

No comments:

Post a Comment