Wednesday, April 29, 2015

rudra veena

మిత్రులకి శుభోదయం

రుద్రవీణ చిత్రం గురించి చెప్పాలంటే మన పేజీ పేరు మార్చాలి, నాకు నచ్చిన పాట కాకుండా "నాకు నచ్చిన చిత్రం లోని అన్ని పాటలు" అనాలేమో!

ఒక చిత్రం లో అన్ని పాటలు అనిముత్యాలలా ఎలా చెయ్యగలుగుతారు, అది మ్యాస్ట్రో కే సాద్యం.

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ బాలచెందర్ చిత్రం, నాగబాబు లాంటి వారు నిర్మించడం చాలా గొప్పనే అంటా. చంద్రబాబు గారి జన్మభూమి కార్యక్రమానికి ఈ చిత్రమే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది.

చిరంజీవి అంటే కమర్షియల్ చిత్రాలు, కమర్షియల్ చిత్రం అంటే ఆరు పాటలు, ఆరు ఫైట్స్ ఉంటాయి అనే దోరణిలో ఉన్న తెలుగు చిత్రాలని కాదని ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి లోని సున్నితత్వాన్ని , మంచి నటుడిని ఆవిష్కరించింది ఈ చిత్రం.
పెంటమ్మ ఎంత అందంగా ఉందంటే చెప్పకర్లేదు, జమిని గణేషన్, ప్రసాద్ బాబు గొప్ప నటనని అందించారు.

ఈ చిత్రం లోని అన్ని పాటలు గురువు గారు శాస్త్రి గారు రాసారు, ఈ చిత్రం లోని నమ్మకు నమ్మకు ఈ రేయిని, తరళి రాద తనే వసంతం, చుట్టూపక్కల చూడరా, పాటలు నాలోని ఆలోచనా విధానాన్ని మార్చాయి అని చెప్పడాని సంకొచించడంలేదు,

వెన్నెల లోని మసకలలోనే మసలును లోకం అనుకోకు, మురళి కి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా, వెన్నెల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగుకద, పాట బాట మారాలని చెప్పడమే నా నేరం గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం  లాంటి ఎంతో  గొప్ప సాహిత్యాన్ని రాసారు గురువుగారు. అయ్యా ధన్యోస్మి, మీరు ఇంకా ఇంకా ఇలాంటి మంచి పాటల్ని మాకు ఇవ్వాలి.

https://www.youtube.com/watch?v=S8ANsRfVPSw

https://www.youtube.com/watch?v=2Cuwg9zVXKU

https://www.youtube.com/watch?v=-s3cdlJFhes

https://www.youtube.com/watch?v=gSkwSSJV7Rg




Sunday, April 26, 2015

maate mantramu

మిత్రులకి వందనం

భారతీయ రాజా గారు భారత దేశ చలనచిత్ర పరిశ్రమకి దొరికన ఆణిముత్యం, ఆయన తీసిన చిత్రాలన్నీ కళాకండాలు, సీతాకోకచిలుక ఒకటి అందులో, ముత్యర్ల అరుణ, కార్తిక్ లకి తొలిసినిమా. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి.

తమిళంలో ముందుగా తీసిన ఈ చిత్రం రాధకి తొలిచిత్రం, అక్కడకూడా కార్తికే హీరో. సిల్కస్మితని మరిచిపోలేం ఈ చిత్రంలో, శరత్ బాబు కి భార్యగా చేసింది.

వేటురిగారి కలం పలు వన్నెలు చూపింది. "నేనే నీవుగా పువ్వు తావిగా" చూడండి ఎంత బాగా కలిపారో.

తమిళంలో ఇలయరాజాగారే పాడితే, ఇక్కడ బాలు తో శైలజ గారు పాడారు. రాజా గారి పాటల్లో చరణాలు పల్లవి కన్నా మెలోడియస్ గా అనిపిస్తాయి నాకు ఎందుకో.


ఓం శతమానం భవతి శతాయు పురుష
శతేన్ద్రియ  ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం  కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా
సంయోగాల  సంగీతాలు విరిసే వేళలో

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
యెదనా కోవెలా యెదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

https://www.youtube.com/watch?v=prHj7RNVTnQ

kalise prati sandyalo

మిత్రులకి శుభోదయం

ఉదయాన్నే ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చెయ్యడానికి బయలుదేరి నా ఫోన్ లోని పాటలను ప్రారంభించగానే ఆలాపన చిత్రం లోని "కలిసే ప్రతిసంద్యలో" పాట మొదలైంది, వెంటనే అనిపించింది ఏంటి నాకు నచ్చిన పాట పేజి లో ఇప్పటిదాకా ఈ పాట ప్రస్తావన తేలేదు అని.

ఈ పాట వేటూరి వారిది అనుకుంటారు, ఇంటర్నెట్ లో చాలామంది వేటూరి వారిదే అని పెట్టారు కూడా.

నారాయణరెడ్డి గారి అమ్మాయిలలో ఇదొకటి, ఎంత బాగా రాసారండి రెడ్డి గారు. మొదటి చరణంలో "పొంగి పోదా సాగరాత్మ నింగికి" ఈ ప్రయోగం ఎవ్వరు చెయ్యలేరు చెయ్యరు కూడా.

వంశీ, రాజా ల కాంబినేషన్ లో వచ్చిన అణిముత్యలలొ ఇది ఒకటి, బాలు, జానకమ్మా భలే పాడారు,

రాజా గారి ఈ పాటలో పల్లవి చరణాల మద్య ఇంటర్ లోడ్ లో మృదంగం, వేణువు, వీణల కాంబినేషన్ చాలా బాగుంటుది.


కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో..  పొంగిపోదా సాగరాత్మ నింగికి చేరుకోదా చంద్ర హృదయం నీటికి సృష్టిలోన ఉంది ఈ బంధమే అల్లుకుంది అంతటా అందమే తొణికే బిడియం తొలగాలి వణికే అధరం పిలవాలి ఆ..ఆ...ఆ... కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో మేనితోనే ఆగుతాయి ముద్రలు గుండె దాకా సాగుతాయి ముద్దులు వింత తీపి కొంతగా పంచుకో వెన్నెలంత కళ్ళలో నింపుకో బ్రతుకే జతగా పారాలి... పరువం తీరం చేరాలి ఆ...ఆ...ఆ...ఆ కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో..

https://www.youtube.com/watch?v=VlbG2JZfbMM


Friday, April 24, 2015

gundello emundo

మిత్రులకి శుభాభినందనలు

సత్యమూర్తి గారి అబ్బాయి DSP గా మనందరికి పరిచయమే, మంచి కిక్కున్న పాటలే కాకుండా మెలోడీ, క్లాసికాల్ పాటలు కూడా చెయ్యగలరని నిరూపించారు.

కింగ్ మన్మదుడు లో గుండెల్లో ఏముందో పాట @venusrirangam చాలా బాగా పాడారు సుమంగళి తో కలిసి

శాస్త్రిగారి కలం గురించి వేరే చెప్పాలా, పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది లాంటివి ఆయినే రాయగలరు. 

నాగార్జునే పాడుతున్నాటు పాడారు వేణు అనడం అతిశయోక్తి కాదంటా, ముఖ్యంగా  గుండెల్లో ఏముందో అన్న ప్రతిసారి గమనించండి . ఇంకా మంచి పాటలు మన తెలుగు అబ్బాయి పాడాలని కోరుతున్నా 

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తుదివరమో తీయని కరుణం ఇది
గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తొంది
మనస మనస మనస మనస మనస మనస
ఓ మనస ఓ మనస 

పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడౌను విని
నిన్నిలా చూసి పయనించి వెన్నెలె చిన్నబోతోంది
కన్నులే తాకి కలలన్ని నిదురగా వచ్చి నట్టుంది
ఏమో ఇదంతా నిజంగ నిజంగా కలలాగె ఉంది

ఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీ
యెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇది
పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పదుతోంది
పరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరింది
దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడొస్తుంది

https://www.youtube.com/watch?v=DA9LHvhX0J8

Thursday, April 23, 2015

vennello godaari andam


మిత్రులకి వందనం

40 వేలకు పైచిలుకు పాటలు పాడిన జానకమ్మ పుట్టినరోజు ఈ రోజు, ఈ పేజి పెట్టి ఆమెని తలుచుకోకపోతే అంతటి మహా పాపం ఇంకొకటి లేదు. అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు,
నాలుగు సార్లు జాతీయ పురస్కారం, 10 సార్లు నంది పురస్కారం, కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలలో ఎన్నో అవార్డ్ లు పొందిన గొప్ప గాయని.
తెలుగులో సితార చిత్రానికి గాను జాతీయ పురస్కారం లభించింది ఆమెకి. వెన్నెల్లో గోదారి అందం పాటకి.
వంశీ  చిత్రాలు అంటేనే ఎంతో మక్కువ మనకి, కారణం మంచి సంగీతం ఉంటుంది అని.
ఇళయరాజా సంగీతం అందించిన ఆ చిత్రం ఒక సుమధుర కావ్యం
వేటూరి గారి రచన దానికి ఇంకొన్ని అందాలు అద్దింది.

పాట ప్రారంభంలో అమ్మ ఆలాపనే గుండెలు పిండేస్తుంది, రాజా గారు వీణ, వాయులీనం చాలా బాగా ఉపయోగిస్తారు. ఇంకో విషయం ఇది ట్యూన్ కి రాసింది కాదు అది రాజా గారి గొప్పతనం.

ఇందులో మొదటి చరణం చూడండి ఎంత గొప్పగా రాసారో వేటూరి,
నాకు బాగా నచ్చిన లైన్,
"నిన్నటి శర పంజరాలు దాటి స్వరపంజరాన నిలిచి"

భానుప్రియే చెయ్యగలదు ఇలాంటి సినిమాలు, పాత్రలు.


వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం ||వెన్నెల్లో గోదారి||

అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం ||వెన్నెల్లో గోదారి ||

జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా ||వెన్నెల్లో గోదారి||

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..

నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..
తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..

https://www.youtube.com/watch?v=DG2KEuD_tyw


Tuesday, April 21, 2015

gopikamma chaalunu


భాగ్యశ్రీ గారు మీకు ధన్యవాదాలు ఒక అధ్బుతమైన పాటని గ్రూప్ కి పరిచయం చేసినందుకు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కృష్ణుడు అంటే వల్లమాలిన ప్రేమ అనుకుంటా, ఆయినా రాసిన కృష్ణుడు పాటలన్నీ సూపర్ హిట్, వేణుమాధవా, అవురా అమ్మకు చల్లా, గోకుల కృష్ణ గోపాల కృష్ణ, పిలిచే పెదవుల పైనా ఇలా అన్నో పాటలు.

తిరుప్పావై మొత్తాన్ని ఆకళింపు చేసుకొని ఆ గోదాదేవే పడుతున్నట్టు రాసారు శాస్త్రి గారు.

దేవులపల్లి వారి తిరుప్పావై తెలుగు పాటలు విన్న వాళ్ళు ఈ పాట కూడా వింటే ఆయనే రాసారేమో అనుకోవచ్చు, అంత గొప్పగా రాసారు శాస్త్రి గారు.

శ్రీకాంత్ అడ్డాల మనకి ఈమధ్య దొరికిన మంచి దర్శకుడు, అయ్యా మీరు ఇలాంటి సినిమాలు ఇంకా తియ్యాలి.

గొపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గొపికమ్మ నిను విడనీమ్మా  మంచు తెర

విరిసిన పూ-మాలగా
వెన్ను యెద వాలగా
తలపును లేపాలిగా .. పారా ..
పరదాలే తీయగా
పరుపె దిగనీయ్యక
పవలింపా  ఇంతగా.. మీరా

కడవల్లొ కవ్వాలు
సుడి తీస్తున్న.. వినక
గడపల్లొ కిరణాలు.. లెలెమన్న కదలక
కలికి ఈ కులుకేల తెల్లవార వచ్చెనమ్మ


గొపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గొపికమ్మ నిను విడనిమ్మ మంచు తెర

నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చెనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేలా సంకోచాలా జవ్వని
బింకాలా బిడియాలు అ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలుపు సంబరాన

గొపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గొపికమ్మ నిను విడనిమ్మ మంచు తెర

నంద కుమారుడు మురళి లోలుడు
నా గోపాలుడు ఏడి ఏడి

లీల కృష్ణ
కొలనులో కమలంలా కన్నె మది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానన్నది
అల్లరికన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తనవైపే రమ్మన్నది
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపికా
చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించానీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఎమారక
వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ

గొపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గొపికమ్మ నిను విడనిమ్మ మంచు తెర

Monday, April 20, 2015

akshya tritiya


మిత్రులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

అక్షయ తృతీయ అనేసరికి ఈ మద్య పేపర్లలోనూ, టీ వీ లలోను తెగ ప్రకటనలు గుప్పించేస్తున్నారు బంగారం కొట్లవాళ్ళు, ఈ రోజు బంగారం కొంటే మంచిదని వగైరా. నా చిన్న తనం లో అయితే మా అమ్మ నాన్న ఈ రోజున బంగారం కొన్నట్టు ఎరుగను.

కొంచెం ఈ పండుగ గురించి తెలుసుకుందాం. అసలు బంగారం కొనాల వద్దా మీరే నిర్ణయించండి!

వైశాఖ శుఖ్ల పక్షంలో మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు.

ఈ రోజున మహా విష్ణు ఆరవ అవతారం అయినటువంటి పరశురాముడు అవతరించాడు.
(పరాక్రమానికి ప్రతిరూపం ఈయన, అయితే బంగారం కొనడం ఈయిన గురించి కాదు, అయితే గియతే పిల్లలకి ఆయినా కధలు చెప్పి సూరులుగా పరాక్రమ వీరులుగా చెయ్యాలి)

భాగిరదుడు ప్రయత్నించగా గంగా అవతరణం జరిగింది.
(తన పితృ దేవతలకి, తన పూర్వికులకి ఊర్ద్వ లోక ప్రాప్తి కోసం కఠొరమైన తపస్సు చేసిన శ్రీరామ చంద్రుని పూర్వజుడు ఈయన, ఈరోజుకి మన ఉత్తర భారతం సుభిక్షంగా ఉంది అంటే ఆ గంగమ్మ కారణం, గంగకి బంగారం ఎందుకు?)


మహాభారతం లో ధర్మరాజుకి అక్షయ పాత్రం ఇచ్చిన రొజు.
(అక్షయ పాత్ర ప్రజలని సుభిక్షంగా పరిపాలించడానికి, ఆకలి లేకుండా అందరం ఉండడానికి )

అమ్మ అన్నపూర్ణేశ్వరిగా అవతరించిన రోజు.
(అమ్మ కడుపు నిండా అన్నం పెట్టడుతుంది, బంగారం, నగలు కాదు)

విచిత్రంగా ఈ రోజే పాపం పేద కుచేలుడు తన స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని కలిసిన రొజు.
(స్నేహానికి మారు పేరు వీళ్ళు, దీనికి బంగారంకి సంభందం లేదు)

ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది ఈరోజే
(ఒక స్త్రీ కి నిండు సభలో అవమానం జరిగిన రోజు, విలువలు లేని వారు వలువలు ఒలిచారు, బంగారంతో ఎంచేసుకోవాలి)

వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈ రోజే ప్రారంభించాడు
(మానవుడు తెలుసుకో వలసిన అన్ని శాస్త్రాలు ఈ భారతంలో ఉన్నాయ్, బంగారానికి దీనికి సంబంధం లేదు)

కుబేరునికి  తన పదవి దొరికిన రోజు.
(తనకి ఆస్తి అంతస్తు దొరికింది కాని, ఊరికే ఆ వడ్డీ కాసులవాడికి డబ్బు ఇవ్వలేదు ఈయిన)

మన భారతావనిలో జైన మతస్తులు చాలా మంది ఉన్నారు, వారు ఈ పండుగని జరుపుకుంటారు, మన ఉళ్ళలో ఎక్కువ శాతం బంగారం దుకాణాలు వీరివే, వీరు నమ్మేది ఏంటి అంటే, శ్రీ మహా విష్ణువు ఈరోజున బంగారం కొని మహా లక్ష్మికి ఇచ్చారని ఒక కధ అందుకు అందరిని బంగారం కొనమని దానివల్ల వారికి బిజినెస్ పెరగుతుందని, ఏమైనాసరే అదికూడా పెట్టుబడిగా కొనండి పర్వాలేదు కాని పిచ్చి నమ్మకంతో కాదు.

గమనిక: ఇది నాయొక్క స్వచింతన, ఎవరిని ఉద్దేశించి చెప్పినది కాదు, మీకు నచ్చినట్టు మీ పెద్దలు చెప్పినట్టు చెయ్యండి.



malle poola maaraniki




శుభోదయం

ఈ మధ్య ఏదో హిందీ ఛానెల్లో ఒక ప్రోగ్రాం చూస్తున్నా, ఇమ్రాన్ హాష్మి గురించి చెపుతూ ఆయనంత చక్కగా ఎవరు లిప్ సింకింగ్ ఇవ్వలేరు అని చెప్తే ఆశ్చర్యం వేసింది వాళ్ళు అక్కినేని గారి సినిమాలు చూడలేదా అనిపించింది. బాలు మిమిక్రి చేస్తారు అనడం కరెక్టే కాని అంత అందంగా తనే పాడుతున్నట్టు లిప్ సింక్ చేస్తారు అక్కినేని గారు, అది బాలు పాడినా, ఘంటసాల గారు పాడినా.

నాకు చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి, చక్రవర్తి గారు కేవలం డబ్బడొక్కుల పాటలకే అని మా చిన్నప్పుడు అనే వారు చాలామంది, దయచేసి ఆయన చేసిన ఇలాంటి పాటలు కూడా వినండి.

అమరజీవి చిత్రం లో యస్ పి పాడిన ఈ పాటని వేటూరి గారు రచించారు.

వేటూరి గారి పూలమీద చాలా ప్రేమ అనుకుంటా చాల పాటలలో ఏదో పువ్వు గురించి ప్రస్తావన తెస్తారు. ఇందులో కూడా అన్ని పూల గురించె.

జయప్రద గురించి చెప్పకపోతే ఎలా ఎంత అందంగా ఉంటుందంటే అబ్బా చూడండి మీరే. she is one of the beautiful actress we are having....



మల్లె పూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా.... కన్నేజాజి ముంగిళ్ళలొనా
కోకిలమ్మ పాట కచేరి .....

పొగడా పూలైనా పొగడే అందాలే మురిసే మలిసంద్యా వేళలో
మల్లి మందారం పిల్లకు సింగారం చేసే మధుమాసా వేళలో
నా  ...... ఆలాపనే
నీ ..... ఆరాధనై
చిరంజీవిగా జీవించనా
హ్యాపీ బర్తడే టు యు


రెల్లుచేలల్లో రేయివేళ్ళలో కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు బొట్టై ఏనాడు మురిసే ముద్దైదు శోభతో
నీ ....... సౌభాగ్యమే
నా...... సంగీతమై
ఈ జన్మకి జీవించనా
హ్యాపీ బర్తడే టు యు


https://www.youtube.com/watch?v=bCrH-dwvpc8




Thursday, April 16, 2015

asalem tochadu naaku

మిత్రులకి వందనం

కృష్ణవంశీ మనకున్న మంచి దర్శకులలో ఒకరు, విలువలున్న చిత్రాలను తీసారు, అందులో ఒకటి అంతఃపురం, షారుఖ్ ఖాన్, నానాపాటేకర్ లాంటి మహామహులతో రీమేక్ చేసినంత మంచి చిత్రం, ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, చిత్రమ్మ స్వరం ఇంకేం కావలి ఈ పాట చాలామందికి ఫేవరేట్ కావడానికి.

ఒక అమ్మాయి లో పరకాయ ప్రవేశం చేసినట్టు రాసారు శాస్త్రి గారు.

కొన్ని ప్రయాగాలు సరికొత్తగా ఉంటాయి ఈ పాటలో "ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ"
శాస్త్రి గారి కలానికి రెండు పాళీలు ఉన్నాయ్ అనిపించింది ఈ పాట వింటే, కొంత శృంగారాన్ని వాడారు గురువుగారు, "చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం" లాంటి ప్రయోగం

వినడానికి చాలా ఇజిగా ఉంటుంది ఈ పాట కాని పాడడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో.

ఆ "సౌందర్య"మైన నటనం మీకెందుకు అని ఆయన మాకు దూరం చేసాడు మిమ్ములని,  ఇలా మళ్ళి మళ్ళి  మిమ్ములని గుర్తుచేసుకుంటాం, we miss you సౌందర్య.

అసలేం గుర్తుకు రాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిముషం కూడ  నిన్ను చూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నాన్నేను  నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలన


గొరువెచ్చని ఊసుతో  చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని  గిల్లుతున్నది చలచల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమై ఏకమయే ఏకాంతం లోకమయె వేళా
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల


కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని
కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండనీ
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హ హ కారం
మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి ఈ రోజు రమ్మన్నా  రాదేమో
నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం

https://www.youtube.com/watch?v=sgMKZfdPads










Wednesday, April 15, 2015

ivvu ivvu okka muddu

ఈ పేజి మొదలుపెట్టి పదిరోజులు కావస్తున్నా మన"సుకవి" గారి ఒక్క పాట మిత్రులకి గుర్తు  చెయ్యనందుకు క్షమించమనే అడగాలి.
"ప్రేమ" చిత్రంలోని పాటలన్నీ ఒక ఎత్తు ఈ పాట ఒక ఎత్తు, విచిత్రంగా అనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా, పల్లవి ఒకలాగా, చరణాలు ఒక లాగా ఉంటాయి, ఒక ర్యాప్ సాంగ్ లాగ మొదలై చరణాలలో శ్రావ్యమైన మోలోడి గా మారుతుంది.

కొన్ని ప్రయాగాలు ఈ పాటలో భలే గమ్మత్తుగా ఉంటాయి.
"ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను"

"ప్రతిరేయీ నీ నెలవంక నేను"
"జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే" లాంటివి, 

ఇసై రాజా నే హిందీలో కూడా సంగీతాని అందించారు. 



ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు(ఇవ్వు)వద్దు వద్దు అంటూ పొతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్ళయ్యింది చాల్లే(ఇవ్వు)ఆద్యంతమూ లేని
అమరానందమే ప్రేమ
 బంధమూ లేని
తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞ్యానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్డులేవి లేనిది అందమైన ప్రేమ(ఇవ్వు) అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
 టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే(ఇవ్వు)

https://www.youtube.com/watch?v=On6sUrFXW00

Tuesday, April 14, 2015

e devi varamu neevo

ఏ దేవి వరము నీవో వేటూరి గారు... నిజంగా తెలుగు పాట చేసుకున్న అదృష్టం మీరు మావారిగా పుట్టడం, మహనీయుల కుటుంబంలో పుడితే చాలు మనకి కూడా ఆ వాసనలు వస్తాయి అనడానికి మీరొక ఉదాహరణ, తెలుగు జాతికి అన్నమయ్యని పరిచయం చేసిన మహాత్భాగ్యం మీ పూర్వజులు ప్రభాకరశాస్త్రి గారి వలన కలిగింది, మీరు లేని లోటు తెలుగు చిత్ర సీమ లో అప్పుడప్పుడు కనిపిస్తోంది.

ఏర్ రెహమాన్ (దిలీప్) స్వరపరిచిన ఈ గీతం శ్రీపాద వారి అమ్మాయి గొంతులో చాలా శ్రావ్యంగా ఉంటుంది.
పి సి శ్రీరాం గారి కెమెరా కళ్ళు ఎంతో చక్కగా చిత్రించాయి,

డబ్బింగ్ పాటలో కూడా మంచి సాహిత్యం రాయగలము అని పదే పదే నిరూపించారు వేటూరి గారు.

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ చిన్నారి ముద్దు పెడితే(2)
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా(2)
ఆయువడిగినది నీ నీడే.......................
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో...............

ఎదకు సొంతం లే
ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని(2)
ప్రాణమైనది పిదప కానిది(2)
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...............

సిరుల దీపం నీవే
కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని(2)
సొగసు చుక్కవో తెగిన రెక్కవో(2)
నేనెత్తి పెంచిన శోకంవా....
ఏ దేవి వరము నీవో.......

https://www.youtube.com/watch?v=O_SAoOj0mIQ

Monday, April 13, 2015

sri raama navami tirunallu

మిత్రులకు వందనాలు

పాట హిట్టైతేనే నచ్చాలని లేదు, సినిమా హిట్ పాట ప్రస్థానం మారుస్తుంది అంటారు, సినిమా ఫ్లాప్ అయితే పాట మరుగున పడిపోతుంది అనడానికి ఇంకొక ఉదాహరణ ఈ పాట

శుభవేళ అని రాంగోపాల్ వర్మ గారి శిష్యుడు రమణ తీసిన చిత్రం, రామోజీ వారు డబ్బులు పెట్టిన హిట్టు కొట్టలేకపోయింది ఈ చిత్రం, చిత్రం బ్యాచ్ చేసిన ప్రయోగం ఈ సినిమా

తేజా కెమెరా బరువు మోసాడు, ఆర్ పి స్వరపరిచాడు, సినీత్రయం లో మూడవ వారు కులశేఖర్ రాసారు.

వీడియో ఎక్కడైనా దొరుకుతుందేమో అని ట్రై చేశా కాని దొరకలేదు, ఎవరికైనా దొరికితే పెట్టండి.
మంచి కాన్సెప్ట్ ఈ పాట, బజారుకి వెళ్ళి కొనుకున్నవన్ని ఇంటికి తెచ్చుకుంటాం మరి మొగుడిని కొనుక్కుని నేను కూడా వెళ్ళడం ఏంటి అని అమాయకంగా అడిగిన ఆ అనసూయ మళ్ళి అంతగా కనపడలేదు ఒకటి రెండు చిత్రాల్లో తప్పా, రవి పర్వాలేదు అనిపిస్తున్నాడు.


శ్రీ రామ నవమి తిరునాళ్ళు నాకప్పుడేమొ ఆరేళ్ళు
నేనడగానే ఈ బొమ్మ ముచ్చటగ కొంది మా బామ్మా
అప్పుడు దీని ఖరిదెంతో తెలుసా పది రూపాయలు

చిన్న నాటి నుంచి  ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం "2"

నా వయసు అప్పుడు పది కామోసు మేమంతా వెళ్ళాం మదరాసు
పాండి బజారున  మాయ బజారులో  ఈ జడ కుచ్చులు, పాపిట బిళ్ళలు, చెవి జుంకాలు, రవ్వల గాజులు ఎన్నో కొన్నది వెన్నంటి మనసు అమ్మది
అప్పుడు వీటి ఖరిదేంతో తెలుసా మరో రెండు సున్నాలు

చిన్న నాటి నుంచి  ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం "2"

నాకప్పుడేమో టీనేజి పక్కురిలోనే కాలేజి "2"
వెళ్లి రావడానికి రాలీ సైకిలు వేసుకోవడానికి కొత్త చెప్పులు పట్టు పావడాలు చోళి గాగరాలు ఎన్నో కొన్నారు మా మంచి నాన్నారు
అప్పుడు వీటి ఖరిదేంతో తెలుసా మరో సున్నా
చిన్న నాటి నుంచి  ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

పెల్లిడుకోచ్చావన్నారు కుర్రోడ్ని తీసుకువచ్చారు నచ్చాడా అని అడిగారు కాబోయే మొగుడన్నారు
కట్నంగా పది లక్షలంట నాగ నట్రా పొలం గట్రా ఇవ్వలంట తీరా ఇవన్నీ ఇచ్చాక నేను కూడా వారితో పుట్టిల్లు వదిలిపెట్టి  వెళ్ళాలంట

చిన్న నాటి నుంచి  ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
మొగుడికోసం ఇంత డబ్బు పోసాం రాను అంటే ఎందుకూరుకుంటాం
ఇదేమి రూలు ఇదేమి న్యాయం చూసారా ఈ విడ్డూరం
చిన్న నాటి నుంచి  ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
ఎన్ని చెప్పిన మేము తాళి కట్టాం అత్తరింటికే నిన్ను తీసుకెలతామ్



Sunday, April 12, 2015

manasa veena madhu geetam

మిత్రులకు శుభోదయం

కన్నడ దేశ ద్వయం గురించి వినే ఉంటారు వారు రాజెన్-నాగేంద్ర అని, ఎన్ని అద్భుతమైన పాటలు తెలుగు చిత్ర సీమకి వారు ఇచ్చారో మచ్చుకకి పంతులమ్మ (నా అల్ టైం ఫేవరేట్) చిత్రం లోని ఈ వేటూరి గారి పాట చూడండి. బాలు మనవాడుగా పుట్టడం మన అదృష్టం, సుశీలమ్మ గారు మనకి వరం.
ఈ పాట హమ్ చేసేవారిని చాలామందిని చూసా, జనరల్ గా కొన్ని తప్పులు పాడతారు, ఉదాహరణకు ములకింతలకే పూచిన కొమ్మ అని పాడతారు అది కొమ్మ కాదు " పొన్న " అది వేటూరి వారి గొప్పతనం. అలాగే మమతెై కడ చేరగలను అని పాడతారు అది "కడ తేరగలను ".


ఆ.... మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం…
సాగరమధనం అమృత మధనం సంగమ సరిగమ స్వర పారిజాతం…
మానస వీణ మధుగీతం… మన సంసారం సంగీతం… సంసారం.. సంగీతం…

ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన  హృదయ పరాగం… ||2||
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడేకోయిల గీతం…
శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమంచు నీ అందమే… విరిసింది  అరవందమై కురిసింది  మకరందమే… || మానస వీణ ||

జాబిలి కన్నా.. నా చెలి మిన్నా ములకింతలకే పూచిన పొన్న …
కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేన్నవ్వగలను …
పాల కడలిలా  వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది…
ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతెై కడ తేరగలను… || మానస వీణ ||

కురిసేదాక అనుకోలేదు శ్రావణ  మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని…
కలిసేదాక అనుకోలేదు తీయని  స్నేహమని
పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడని… || మానస వీణ||

ikshvaku vamsam

మిత్రులకు సుమనఃసుమాంజలి

చిన్నప్పుడు మనమందరం భాగీరధి  ప్రయత్నం గురించి చదువుకొన్నాం గుర్తున్నదా, అలాగే షట్చక్రవర్తుల గురించి చెప్పినప్పుడు సగరుడు గురించి చెప్తారు, అలాగే దీలీపుడు గురించి కూడా, వీళ్ళందరూ ఎవరో తెలుసా ఆ  శ్రీరామ చంద్రుని పూర్వజులు,  ఒక్కసారి రాముని తాతలు, ముత్తాతలు ఎవరో చూద్దాం. 

రామాయణం బాలకాండలో 70 సర్గ లో చెప్తారు వాల్మీకి మహర్షి. 

అవ్యక్తప్రభవొ బ్రహ్మా శాశ్వతొ నిత్య అవ్యయః
అవ్యక్తమైన పరబ్రహ్మమునుండి బ్రహ్మదేవుడు జన్మించెను, అతడు శాశ్వతుడు, నిత్యుడు,నాశరహితుడు, ఆ బ్రహ్మదేవుని నుండి మరీచి పుట్టెను. మరిచసుతుడు కాశ్యపుడు, కాశ్యపుని వలన సూర్యుడు (వివస్వంతుడు), సూర్యుని కుమారుడు వైవస్వతమనువు. ఈ మనువే మొదటి ప్రజాపతి, అతడు మహారాజు, మనువు పుత్రుడు ఇక్ష్వాకువు, ఈ ఇక్ష్వాకువు మొదటి అయోధ్యాపతి, ఈయన కుమారుడు కుక్షి, కుక్షి గారి సుపుత్రుడు వికుక్షి, వికుక్షి పుత్రరత్నం బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు. 


Saturday, April 11, 2015

gharhsya dharmam

మిత్రులకు సుమనఃసుమంజలి

చాలారోజులైంది మిమ్ముములనందరిని కలిసి. ఈ వ్యాసం నీను రాసింది కాదు మా సోదరుడు రాసింది బాగుందని మీకోసం ఇక్కడ ప్రచురిస్తున్నా

గార్హస్థ్య ధర్మం గురించి ఈ రోజు తెలుసుకుందాం

గార్హస్థ్యధర్మ (గృహస్థధర్మము)పీఠానికి పాదాలు నాలుగు .. 

ఒకటి - గృహస్థు లేక యజమాని..,
రెండు - గృహిణి లేక ఇల్లాలు..,
మూడు - పుత్రుడు లేక సంతానం..,
నాల్గు - ధర్మం .., ఇదే సత్యమని,త్యాగమని, శాంతమని,ప్రేమ అని,అహింస అని అనేక పేర్లతో పిలవబడుతోంది..!

యజమాని, ఇల్లాలు, సంతానము కూడా వారి వారి విధులను ధర్మబద్ధంగా నిర్వహించాలి..

దీనికి ఉదాహరణ .. మహాభారతంలోని  ...,యయాతి-దేవయాని-శర్మిష్ఠ-పూరుని  కథలే..

"త్యాగేనైకేన అమృతత్వమానశుః" - అనేది ఉపనిషత్సూక్తి. 


అన్నదమ్ములందరూ కాదన్నా ..., "తనువిచ్చిన తండ్రికి-తనువిచ్చుకోడం తన సుకృతమనుకున్నాడు.., తండ్రి ముసలితనాన్ని తానుస్వీకరించి తండ్రికి యౌవనాన్నితిరిగి తీసుకవచ్చేడు..పూరుడు. ఆతని త్యాగమే... తండ్రి గార్హస్థ్యధర్మానికీ .., తద్వారా గార్హస్త్యంలో ముఖ్యమైన తన పుత్ర ధర్మానికీ.., త్యాగగుణం వలన కలిగే అమృతత్వసిద్ధికి కారణమైంది ..

మనం కూడా ఆ అమృతత్వ సిద్ధికి ప్రయత్నం చేసేందుకు యయాతి కథ ద్వారా మనకందించింది మహాభారతం..

దానవులకు శరీరం ముఖ్యం ..చనిపోయినా మళ్ళా బ్రతకాలి.. బ్రతకడం మీద ఉన్న యిచ్ఛ ఎల్లా బ్రతకాలి అనేదానిమీద అస్సలు ఉండదు వాళ్ళకి ..

మానవులకి ముఖ్యం - ఎల్లా మరణించామన్నది కాదు, ఎల్లా జీవితాన్ని సాగించామన్నది ముఖ్యం. మనిషి చనిపోయినా ఆతణ్ణి బ్రతికించేది ధర్మం..అందునా శ్రేష్ఠమయిన ధర్మం త్యాగం. అందుచేతనే .. మానవజీవితంలో మరణాన్ని,  భౌతికంగా జయించే పద్ధతికంటే ..., ధార్మికంగా జయించే పద్ధతికి ప్రాముఖ్యతేర్పడింది.

గార్హస్థ్య ధర్మం నాలుగు పాదాలతో నడవాలంటే.., ఆ ధర్మాన్ని నిర్వహించే వారికి అంతఃకరణ శుద్ధి ఉండాలి.  చిత్తశుద్ధి లేకపోతే సత్యం ప్రకటితం కాదుకదా! సత్యం నిలవకపోతే సంసార వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఇల్లాలికి అన్యాయం జరుగుతుంది ... పుత్రుడికి అస్తిత్వం లేకుండా పోతుంది.. గృహస్థు అసత్యదోషంతో అంతరించిపోతాడు.  కనుక గార్హస్థ్య ధర్మానికి అమృతత్వమ్ కలిగించేది -  సత్యధర్మనిరతి అనేది సత్యం.

మానవ జీవితంలో మృత్యువొక అనివార్యo..  కానీ, మరిణించే దేహం నిర్వహించే ధర్మం అజరామరo! 
దానిని సాధించడమే మానవజీవన పరమార్ధం....గమ్యం.(మహాభారతం)

Friday, April 10, 2015

telavaarademo swamy

పాటల ప్రియులకు శుభోదయం

పదకవితా పితామహుడుగా మనం గర్వపడే శ్రీ అన్నమయ్య గారి రచనకి తీసిపోకుండా (అతిశయోక్తి  కాదనుకుంటా) శృతిలయలు చిత్రం కోసం శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు రచించిన తెలవారదేమో స్వామి గీతాన్ని చూద్దాం ఈ రొజు. చాలా మంది ఇది అన్నమయ్య గారి పాటే అనుకుంటారు అంత బాగా రాసారు శాస్త్రి గారు. మహదేవన్ గారి సంగీతం,జేసుదాసు గారి స్వరం, విశ్వనాద్  గారి చిత్రం హిట్ కాక మరేంటి చెప్పండి.  ఫిమేల్ వెర్షన్ (సుశీలమ్మ) వచ్చినప్పుడు జయలలిత గారి డాన్సు బాగుంటుంది, నాకు తెలిసి ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ ఆ తరువాత ఆ మాత్రం చేసే అవకాశం ఆమెకు దొరకలేదు. 1987 లో వచ్చిన చిత్రం ఇది, ఆ సంవత్సరం ఉత్తమ గీతరచయితగా  శాస్త్రి గారికి నంది పురస్కారం కూడా వచ్చింది. విశ్వనాద్ గారు ఈ పాటని శాస్త్రి గారి చేత ఎందుకు రాయించారు, అన్నమయ్య గారిదో, త్యాగరాజు గారిదో ఒక కీర్తనని పెట్టచ్చు కదా,  ఆ గొప్ప వాళ్ళ కీర్తన పెట్టి అభాసుపాలు కావడం కన్నా ప్రస్తుతం ఉన్న కవుల చేత అయితే కొంత మేలు అనుకోని ఉంటారు.

తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీనీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూతెలవారదేమో స్వామీనీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూతెలవారదేమో స్వామీచెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ
తెలవారదేమో స్వామీమక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా
మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా
 ఆ మత్తునే మది మరి మరి తలచగా .. మరి మరి తలచగా
అలసిన దేవేరి.. అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ.. గా మ ప ని
తెలవారదేమో  సా ని ద ప మ ప మ గ ని స గా 
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ 
తెలవారదేమో స్వామీ 

https://www.youtube.com/watch?v=96W04898pQE

https://www.youtube.com/watch?v=8wj7xDc4x9A


yogulu saagina maargamidi

యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదద్వజ ఛాయలలో సాగిన  భరతావని దిగ్విజయమిది                                                  "యోగులు "

రాతికి రాప్పకి చెట్టుకి చేమకి చెరాచెరమ్ములకన్నిటికి
నతమస్తకమౌ నతులు సలుపు మరమౌన్నతమౌ ఘన సంసృతిది
వినయము విద్యాభూషనమనుకోను విమల మనస్కుల వీడు ఇది
దురహంకారము దరిచేరని మహనీయ జీవనుల మార్గమిది                                            " యోగులు "

సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగ నెంచినది
ఆద్యంతమునకు అటు నిటు నిలిచిన ఆనందము పరికించినది
గీతా జ్యోతిని ఒసగి చేతమున చేయుతలలను అందించి
అగ్యానమునకు



Wednesday, April 8, 2015

eppudu oppukovadduraa otami



మిత్రులకు శుభోదయం

ప్రారంభించిన మొదటిరోజే 4 మంచి  పాటలతో గడిచింది నిన్న. నిస్పృహ నిరాశల నుండి బయటకు రమ్మని ప్రేరణ కలిగించే ఒక మంచి పాట చూద్దాం ఈరోజు

పట్టుదల అనే చిత్రం కోసం గురువుగారు శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ గీతాన్ని చూడండి. 
youtube లో ఉన్న లింక్ కూడా చూడండి ఈ పాట గురించి నేను చెప్పడం కన్నా వారి మాటలలో చూడండి. commercial చిత్రం కాకపొతే పాట ఎలా అడుగంటి పోతుందో అనడానికి ఈ గీతం ఒక ఉదాహరణ. జేసుదాసు గారి గొంతులో కన్నా శాస్త్రి గారి గళంలో ఎందుకో నాకు నచ్చింది. ఆ భావం బాధ అయిన స్వరం లోనే కనిపించాయి. 

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి 
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి 
విశ్రమించవద్దు ఏ క్షణం 
విస్మరించవద్దు నిర్ణయం 
అప్పుడే నీ జయం నిశ్చయంరా     " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా "2"
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా 
పశ్చిమాన పొంచి ఉండి  రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా 
గుటక పడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా 
నిశా విలసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా 
రగులుతున్న గుండె కూడ అగ్నిగొళమంటిదేనురా    " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "

నొప్పి లేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా 
నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణా 
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా "2"
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను 
ఆశయమ్ము సారదౌనురా 
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా 
ఆయువంటు ఉన్నవరకు చావుకూడా నెగ్గలేక శెవము పైన గెలుపు చాటురా  " ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి "

ఆఖరి లైను చూడండి ఒరిజినల్ గా సినిమాలో లేదు కాని శాస్త్రి గారికి ఆ లైన్ అంటే చాలా ఇష్టం నాకు కూడా, చాల దైర్యం కావలి ఆలా రాయాలంటే.

మీకందరికీ మరొక మంచి శుభదినం కావాలని కోరుకుంటున్నా. 

ప్రారంభం సోదరుడు కులశేఖర్ పాటతో మొదలు పెడదాం అనుకున్నా

జై చిత్రం కోసం జాతీయ సమైక్యతా గీతం రాసాడు, అది ఎంత పాపులర్ అయ్యింది అంటే ఆగష్టు 15 కి జనవరి 26కి తప్పకుండా వినిపించే పాట. బిన్నత్వంలో ఏకత్వం గురించి సోదరుడు చాలా అద్భుతంగా రాసారు.

సోదరా నీకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతున్నా.

దేశం మనదే, తేజం మనదే
ఎగురుతున్న ఝండా మనదే
నీతి మనదే, జాతి మనదే
ప్రజల అండ దండ మనదే
అందాల భందం వుంది ఈ నేలలో
ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో...
ఎ కులమైన, ఎ మతమైన
బరతమాత కొకటి లేరా
ఎన్ని దేహలున్న, మకేన్ని తేడాలున్న
దేశమంటే ఎకమవుతాం అంత ఈ వేళ
వందేమాతరం అందాం అందరం......
రాజులు ఐన పేదలు ఐన
భరతమాత సుతులే లేరా
ఎన్ని దేశాలున్నా మాకు ఎన్ని దోషాలున్న
దేశమంటే ప్రాణమిస్తాం అంత ఏ వేలా.....
వందేమాతరం అందాం అందరం.....