జై శ్రీమన్నారాయణ
రాగం : మోహన
సంపుటి 2, సంకీర్తన 372
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణప్రసాద్ & శ్రీ అనిలకుమార్
గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి
ఈతడే చూపె ఘన గురుదైవము
అన్నమాచార్యుల వారు తనకు శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రభావం భగవద్రామానుజుల వారి వల్ల కలిగింది అని చెప్తారు, వారి మీద రాసిన కీర్తన ఇది,
ఈ కలియుగంలో దారులన్నీ పాడైపోతూ ఉంటే వారే ఒక దారై చూపిన మహా గురువులు రామానుజులు అంటారు.
ఈతని
కరుణనేకా ఇలవైష్ణవుల మైతి
మీతని
వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే
ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము
ఈతడే
రామానుజులు ఇహపర దైవము
వారి వలన మనం విష్ణుభక్తులమైనాము, వారి వలన వైకుంఠ మణి చూడగలిగాం, వారివల్లనే మనం నారాయణ అష్టాక్షరీ మంత్రము పలుకగలిగాం, ఆయినే రామానుజులు ఈ భూతలంమీద నడిచే దైవం అంటున్నారు.
వెలయించె
నీతడేకా వేదపు రహస్యములు
చలిమి
నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే
కా నిజముద్రా ధారణము
మలసి
రామానుజులు మాటలాడే దైవము
వేదాలలోని సంక్లిష్ట రహాస్యాలను మనకు వివరించారు, శరణాగతి మార్గాన్ని మనకు చెలిమితో చూపారు, శంఖచక్ర (నిజముద్రధారణ) ధరియించినవాడు. నిజానికి రామానుజులు మనతో మాట్లాడే దైవము అంటారు అన్నమయ్య.
స్వామిని చేరేందుకు నియమాలని పెట్టనివారు, మనకి మోక్షమార్గాన్ని ప్రసాదించి, ఆ వేంకటేశ్వర స్వామి కి చేరువైన మనకి తల్లి తండ్రిలా దయచూపిన వారు అంటారు అన్నమయ్య
నియమములు
ఈతడేకా నిలిపె ప్రపన్నులకు
దయతో
మోక్షము చూపె తగనీతడు
నయమై
శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను
దయచూచి
మమ్మునిట్టే తల్లిదండ్రి
No comments:
Post a Comment