Thursday, August 20, 2020

చదివి బ్రతుకరో సర్వజనులు మీరు

జై శ్రీమన్నారాయణ 

రాగం : మాధ్యమావతి 

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 

సంపుటి : 4, సంకీర్తన 33. 

 

" ఓం నమో నారాయణాయ"  శ్రీ  మన్నారాయణుని అష్టాక్షరీ మంత్రం రాజమిది! సర్వ పాపాలను పరిహరించి, ముక్తి మార్గాన్ని అందరికీ సులభంగా అందించేది! కుల మత వర్గ వర్ణ అధిక నిమ్న భేదాలతో పట్టింపు లేకుండా ఈ మంత్ర పఠనకు భక్తి గల వారందరూ అర్హులే! అందుకే అన్నమయ్య సర్వజనులు అంటున్నారు. అంతేకాకుండా కొన్నారో కొన్నారో పాటలో వలే ఈ మంత్రరాజాన్నిపఠించి ఎవరెవరు  తరించారో చాలా చక్కగా అర్ధ వివరణ అవసరం లేకుండా అన్నమయ్య చెబుతున్నారు! కాబట్టి మనమంతా 'నారాయణాష్టాక్షరీ' మంత్రాన్ని చదివి బ్రతుకుదాం! జీవితాలను సార్ధకం చేసుకుందాం! 

 

కదిసి = సమీపించి 

గాదిలి = ప్రేమము 

వెతదీర  = దుఃఖము (బాధ) తొలగిపోవునట్లు 

జతనము = ప్రయత్నము 

గతి = మార్గము 

వెలయ = ప్రాకాశించునట్లు 

 


 

చదివి బతుకరో సర్వజనులు మీరు 
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||

సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు 
వేదవ్యాసులు చదివిన చదువు |
ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే ||

సతతము మునులెల్ల చదివినట్టిచదువు 
వెతదీర బ్రహ్మ చదివిన చదువు |
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు 
గతిగా నారాయణాష్టాక్షర మిదియే  ||

చలపట్టి దేవతులు చదివినట్టిచదువు 
వెలయ విప్రులు చదివేటి చదువు |
పలుమారు శ్రీ వేంకటపతి నామమై భువి 
కలుగు నారాయణాష్టాక్షర మిదియే  ||


No comments:

Post a Comment