మిత్రులకి వందనం
ఈ రోజు తెలుగు చలనచిత్ర చరిత్ర లో సువర్ణాక్షరాలలతొ లిఖించదగ్గ చిత్రం రిలీజ్ అవుతోంది, దర్శకుడు గుణశేఖర్ తనే నిర్మాతగా నిర్మించిన రుద్రమదేవి. ఒక హీరొయిన్ ని నమ్మి 80 కోట్లు పెట్టి చిత్రం తీయడం అంటే మాటలా. మన తెలుగు వాడు చిత్రం తీసాడు చూడండి అని చెప్పటం లేదు, మన చరిత్ర తెరకి ఎక్కించారు చూడండి అంటున్నా. మల్టి స్టారర్ చిత్రాలు రావు అనుకునే తరుణంలో భాహుబలి, రుద్రమదేవి ఒకే సంవత్సరంలో నిర్మించడం ఒక శుభ తరుణం.
రాజా గారు చాలా రోజుల తరువాత తెలుగు లో చేసిన చిత్రం, శాస్త్రి గారు సింగల్ కార్డు, అనుష్క మీద చిత్రీకరించిన పున్నమి పువ్వై పాట భలే ఉంది. అలాగే రాణా అనుష్కలమీద చిత్రీకరించిన అవునా నిజమేనా పాట చిత్రీకరణ ఎంతో బాగుంది. గ్రాఫిక్స్ చిత్రంలో భాగం కావడం వేరు, గ్రాఫిక్సే చిత్రం కావడం వేరు. తెలంగాణాకి తలమానికం అయిన కుంతలా వాటర్ ఫాల్ దగ్గర తీసిన ఈ పాట చాలా అందంగా చూపించారు దర్శకులు.
https://www.youtube.com/watch?v=ty23HlLQAgc
https://www.youtube.com/watch?v=odMiZu2vpHI
No comments:
Post a Comment