Thursday, September 10, 2015




శ్యామ సుందరుడు నల్లని వాడు, కాని  పద్మ నయనంబుల వాడు అని, కృపా రసంబు తమపై  పడాలని ఆ గిరిరాజ పుత్రి వస్తూ ఆ మేరు పర్వత వెలుగులు తెచ్చి ఆ పెద్ద పెద్ద కళ్ళలో వెలుగులు నింపింది, అంతేనా ఆ సుందరుడి సాహచర్యంతో "ప్రదీప్త"మైన "పూర్ణిమా" కాంతులు నింపింది. ఆ పూర్ణిమా నిశలకు ప్రశాంతుడు చల్లని తోడై, వీడని నీడై, ప్రవరుడై, ప్రచేతుడయ్యాడు, అంతటితో ఆగిందా మరి ప్రదీప్త కాంతులు శ్రీధరమై సుమధురమై అమేయమై ఈరోజు అవ్యయమైన ఆనందాన్ని ఇచ్చింది. 

ఆ ఆనందం కలకాలం నిలవాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నా.

No comments:

Post a Comment