మిత్రులకి వందనం
నిన్నటికి సరిగ్గా 6 సంవత్సరాలు మహానుభావులు శ్రీమాన్ వేటూరి సుందరరామ్మూర్తి గారు మనల్ని విడిచి.
1974 లో శ్రీ శ్రీ గారి తరువాత ఇరవై సంవత్సరాలకి వేటూరి గారు మాతృదేవోభవ చిత్రానికి నేషనల్ అవార్డు మనకి అందించారు " రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి. అదే చిత్రంలోని వేణువై వచ్చాను భువనానికి పాట నాకు బాగా ఇష్టం, ఈ పాటతో వారిని మరొక్క సారి గుర్తు చేసుకుందాం, చిత్రమ్మ గొంతు ఎంతో ఆద్రతతొ వినిపిస్తుంది. కీరవాణి గారి సంగీతం ఇంకేం కావాలి ఒక మంచి పాటకి.
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
https://www.youtube.com/watch?v=W4yM7Wk1zRc
https://www.youtube.com/watch?v=jzTMSbJbmUg
నిన్నటికి సరిగ్గా 6 సంవత్సరాలు మహానుభావులు శ్రీమాన్ వేటూరి సుందరరామ్మూర్తి గారు మనల్ని విడిచి.
1974 లో శ్రీ శ్రీ గారి తరువాత ఇరవై సంవత్సరాలకి వేటూరి గారు మాతృదేవోభవ చిత్రానికి నేషనల్ అవార్డు మనకి అందించారు " రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే" పాటకి. అదే చిత్రంలోని వేణువై వచ్చాను భువనానికి పాట నాకు బాగా ఇష్టం, ఈ పాటతో వారిని మరొక్క సారి గుర్తు చేసుకుందాం, చిత్రమ్మ గొంతు ఎంతో ఆద్రతతొ వినిపిస్తుంది. కీరవాణి గారి సంగీతం ఇంకేం కావాలి ఒక మంచి పాటకి.
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
https://www.youtube.com/watch?v=W4yM7Wk1zRc
https://www.youtube.com/watch?v=jzTMSbJbmUg
No comments:
Post a Comment