Monday, October 5, 2020

శరణంటి మాతని సంబంధమునజేసి

 జై శ్రీమన్నారాయణ 

రాగం : లలిత 

సంపుటి 2, సంకీర్తన 24

రాసిన వారు : శ్రీ పెద్ద తిరుమలాచార్య 

పాడినవిధానము : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 


శరణంటి మాతని సంబంధమునజేసి 

మరిగించి మమునేలి మన్నించవే 


సకల వేదములు సంకీర్తనలు చేసి 

ప్రకటించి నినుపాడి పావనుడైన 

అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యులు 

వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ 


నారదాది సనక సనందనాదులవలె 

పేరుబడి నిన్నుపాడి పెద్దలైనట్టి 

ఆ రీతి తాళ్ళపాక అన్నమాచార్యుల 

చేరి ఏలినయట్టి శ్రీ వేంకటనిలయ 


సామవేద సామగాన సప్తస్వరములను 

బాముతో నీసతి నిన్ను పాడినయట్టి 

ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల 

వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ 


పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన ఇది, అన్నమయ్య వంశస్థులమై, ఆ మహనీయునితో గల అనుబంధంతో మిమ్ముల్ని శరణు కోరుతున్నాను స్వామీ! సకల వేదసారాన్ని సంకీర్తనలుగా మలచి, నారదసనక సనందనాదుల వలె నీపై సంకీర్తనలు పాడి, సామవేద సామగాన సప్తస్వరములను నీకంకితం చేసిన అన్నమయ్యను చూసైనా మమ్ముల్ని కరుణించు వేంకటనిలయా! అంటూ విన్నపం చేస్తున్నాడు పెద్దతిరుమలయ్య . 

No comments:

Post a Comment